ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు:సాయం కోసం ముందుకొచ్చిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- January 08, 2020
ఆస్ట్రేలియాలో ఇటీవల చోటు చేసుకున్న తీవ్రమైన కార్చిచ్చు విషయమై సహాయం అందించేందుకు తాము సిద్ధంగా వున్నట్లు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో షేక్ మొహమ్మద్ ఈ మేరకు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఆస్ట్రేలియాకి యూఏఈ ఈ విషయంలో అండగా వుంటుందని షేక్ మొహమ్మద్ చెప్పారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ - ఆస్ట్రేలియన్ గవర్నమెంట్తో కలిసి ఈ విషయమై పనిచేస్తుందని ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్కి షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ చెప్పారు. ఈ కార్చిచ్చులో 25 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మిలియన్ల కొద్దీ జంతు జాలం మృత్యువాత పడింది. సెప్టెంబర్ నుంచి ఈ కార్చిచ్చు రగులుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







