ఇరాక్ లోని భారతీయులకు హెచ్చరిక..
- January 08, 2020
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఇరాక్ లోని భారతీయులు అత్యవసరం కాని తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. అలాగే ఇరాక్ దేశానికి వెళ్లగోరే ఇండియన్స్ కూడా తమ ప్రయాణాల వాయిదాపై మరోసారి ఆలోచించాలని సూచించింది. ఇరాక్ లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులతో ఉద్రిక్తత రేగగా.. ఇండియా ఈ ' ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇరాక్ లో నివసిస్తున్న భారతీయులకు అన్ని సర్వీసులు అందజేసేందుకు బాగ్దాద్ లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఎర్బిల్ లోని మన దౌత్య కార్యాలయం కూడా మామూలుగానే పని చేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అటు-ఇండియాలోని అన్ని ఎయిర్ లైన్స్.. అప్రమత్తంగా ఉండాలని, ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల వైమానిక గగనతలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీజీసీఏ కూడా సూచించింది. ఇరాక్ లో అనేకమంది భారతీయులు నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







