50 ఏళ్ల పాటు UAEని రిప్రజెంట్ చేసే కొత్త లోగో రిలీజ్
- January 08, 2020
యూఏఈ బ్రాండ్ ఇమేజ్ చాటేల కొత్త లోగో రిలీజ్ అయ్యింది. దుబాయ్ వైస్ ప్రెసిడెంట్/ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కొత్త లోగోను ఆవిష్కరించారు. ఇప్పటి మరో 50 ఏళ్ల పాటు ఇదే లోగో యూఏఈని రిప్రజెంట్ చేయనుంది. కొత్త లోగోకు సంబంధించి షేక్ మొహమ్మద్ తన ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఎమిరాతి స్ఫూర్తి చాటేలా ఇక నుంచి అన్ని సంస్థలు, అన్ని సెక్టార్స్ లో లోగోను వినియోగించటం స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. 'ఈ రోజు నేను, సోదరుడు మొహమ్మద్ బిన్ జయాద్, 49 మంది ఎమిరాతి ఇన్నోవేటర్స్ కలిసి యూఏఈ ఐడెంటిని చాటేలా లోగోను విష్కరించాం. మన అభివృద్ధి లక్ష్యాలను సూచికగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలతో ఏడు ఎమిరేట్స్ పోటీతత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది' అని షేక్ మొహమ్మద్ అన్నారు.
లోగో డిజైనింగ్ లో ఏడు ఎమిరేట్స్ నుంచి మొత్తం 49 ఎమిరాతి డిజైనర్స్ కలిసి మూడు లోగోలను రూపొందించారు. ఈ మూడు లోగోల నుంచి ఒక దాన్ని ఎంపిక చేసేందుకు ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహించగా 10 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. వీరిలో మెజారిటీ ఓటర్ల ఎంపిక మేరకు మూడు లోగోల్లో ఒక లోగోను ఫైనల్ చేశారు. అయితే..ఓటింగ్ లో పాల్గొన్న 10 మిలియన్ల మందికి సూచికగా పది మిలియన్ల మొక్కలను నాటుతామని షేక్ మొహమ్మద్ తెలిపారు.

తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







