ఆస్ట్రేలియా బుష్ ఫైర్:సహాయక చర్యల కోసం 200 మంది వాలంటీర్లను పంపించనున్న యూఏఈ
- January 09, 2020
అబుదాబి: బుష్ ఫైర్ క్రైసిస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియాకు యూఏఈ ఆపన్నహస్తం అందించనుంది. ఆస్ట్రేలియాలో సహాయక చర్యల కోసం 200 మంది వాలంటీర్లను పంపించేందుకు యూఏఈ నిర్ణయించింది. ఈ మేరకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్డ్మ్ ఫోర్స్ డిప్యూటీ సూప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జియాద్ నెహ్యాన్ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ తో చర్చించారు. అడవులను కాల్చేస్తున్న కార్చిచ్చు సివియారిటీ గురించి ఆయన అడిగి తెల్సుకున్నారు. బుష్ ఫైర్ ను ఎదుర్కునేందుకు సమర్ధులైన నిపుణులను, ఈక్విప్మెంట్, మ్యాన్ పవర్ పింపించేందుకు యూఏఈ సిద్ధంగా ఉందని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు అండగా
నిలబడతామని స్కాట్ మెరిసన్ కు షేక్ మొహమ్మద్ తెలిపారు.
యూఏఈ రెడ్ క్రెసెంట్ అగ్నిప్రమాదాల సమయాల్లో మంటలను అదుపుచేయటంతో పాటు నష్ట తీవ్రతను తగ్గించటంతో ఎక్స్ పర్ట్ టీం. ఈ టీం ఆస్ట్రేలియా మంటలను, దట్టమైన పొగను ఎదుర్కొని ఎలా మంటలను అదుపు చేయాలో తగిన ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తుంది. పచ్చటి అడవులను సైతం బూడిద చేసే ఇలాంటి కార్చిచ్చు చెలరేగినప్పుడు మంటల కంటే ఊపిరిసలపనంత దట్టంగా వ్యాపించే పొగతోనే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నెల రోజులకు పైగా అడవుల్లో రాజుకున్న బుష్ ఫైర్ కారణంగా ఆస్ట్రేలియాలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కొల్పోయారు. వేల సంఖ్యలో ఇళ్లు బూడిదయ్యాయి. దాదాపు 50 కోట్ల మూగజీవాలు బుష్ ఫైర్ ధాటికి చనిపోయాయి
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







