విడాకులు కావాలన్న భార్య విన్నపాన్ని తిరస్కరించిన హై షరియత్ కోర్టు
- January 09, 2020
బహ్రెయిన్:తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ యాభై ఏళ్ల మహిళ చేసుకున్న విన్నపాన్ని హై షరియత్ కోర్టు తిరస్కరించింది. భర్త తనను చిత్రహింసలు పెడుతున్నాడని, అవమానిస్తున్నాడని ఆరోపిస్తూ విడాకులు కావాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే..ఆరోపణలు నిరూపించటంతో ఆమె తగిన సాక్ష్యాలను మాత్రం చూపించలేకపోయింది. దీంతో కుటుంబ సంక్షేమం, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా విడాకుల విన్నపాన్ని తిరస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
డైవోర్స్ కోరిన జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లల సంరక్షణకు కుటుంబం ఒక్కటిగా ఉంటేనే మంచిదని, విడాకులు మంజూరు చేయటం అంటే పిలల్ల భవిష్యత్తును రిస్క్ లోకి నెట్టడమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. భర్త తరపు వాదనలు వినిపంచిన లాయర్..తన క్లైయింట్ తన శ్రమను, సంపాదనను అంతా ఫ్యామిలి కోసమే కేటాయిస్తున్నట్లు కోర్టుకు వివరించాడు. అతని కోసం దాచుకుంది ఏమి లేదని స్పష్టం చేశాడు. అయితే..తనను గదిలో బంధిస్తున్నాడన్న భార్య ఆరోపణలను భర్త తరపు లాయర్ కొట్టిపారేశారు. అతను లేని సమయంలో ఎటైనా వెళ్లాలని అనుకుంటే ముందుగా తనకు ఇన్ఫామ్ చేయాలని మాత్రమే కోరినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఇలాంటి రిక్వెస్ట్ లు మన సొసైటీ సాధారణమేనని కూడా కోర్టుకు వివరించాడు. భర్త తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు విడాకుల కావాలన్న భార్య విన్నపాన్ని తిరస్కరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







