ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా

- January 09, 2020 , by Maagulf
ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా

ఇరాన్ క్రైసిస్ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ విజిటింగ్ సేఫ్ కాదంటూ ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న హెచ్చరికలు అర్ధం లేనివని తేల్చి చెప్పింది. ఇరాన్ సంక్షోభం దుబాయ్ పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. విజిటర్స్ నిస్సంకోచంగా నిర్భయంగా దుబాయ్ లో పర్యటించొచ్చని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఇరాన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ని టార్గెట్ చేస్తూ మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడింది. కథనాలను ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకొని వాస్తవాలను పబ్లిష్ చేయాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com