బాగ్దాద్లోని గ్రీన్జోన్ లో రెండు రాకెట్లు దాడి
- January 09, 2020
బాగ్దాద్: ఇరాన్ తో శాంతినే కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అత్యంత పటిష్ఠమైన భద్రత, యూఎస్ తదితర దేశాల ఎంబసీలు ఉన్న గ్రీన్ జోన్ పై రెండు రాకెట్లను ఇరాన్ ప్రయోగించడం తీవ్ర కలకలాన్ని రేపింది. అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగిందని వార్తా సంస్థ ఏఎఫ్పీ ప్రకటించింది. గ్రీన్ జోన్ లో భారీ శబ్దాలు వినిపించాయని, ఇరాక్ లోని సంకీర్ణ దళాల సైనిక స్థావరాలపై మిసైల్ దాడులు జరిగిన 24 గంటల తరువాత తాజా దాడి జరిగిందని పేర్కొంది. తాజా దాడులు కూడా సులేమానీ హత్యకు ప్రతీకారంగా జరిగినవేనని సమాచారం. ఈ ఘటనతో ఇరాక్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..