సియాచిన్లో సైనికులను కలిసిన ఆర్మీ చీఫ్
- January 09, 2020
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఇవాళ సియాచిన్లో పర్యటించారు. అక్కడ ఆయన సైనికులతో ముచ్చటించారు. వారికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడకు రావాలనుకున్నాను, కానీ వాతావరణం సరిగా లేని కారణంగా జనవరి మొదటి వారం పర్యటనను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. అయినా సియాచిన్కు ఆర్మీ చీఫ్గా మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. సియాచిన్లో విధులు నిర్వర్తించడం అంటే చాలా క్లిష్టమైన అంశమని, ఇక్కడ అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉంటాయన్నారు. దుస్తులు, రేషన్తో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







