సుల్తాన్‌ కబూస్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్‌ మొహమ్మద్‌

- January 11, 2020 , by Maagulf
సుల్తాన్‌ కబూస్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన షేక్‌ మొహమ్మద్‌

ఒమన్‌ సుల్తాన్‌ కబూస్‌ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, సుల్తాన్‌ కబూస్‌ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా సంతాప ప్రకటన చేశారు. లాయల్టీ, లవ్‌ మరియు విజ్డమ్‌ విషయంలో సుల్తాన్‌ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఒమ్‌ సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సయిద్‌ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఒమన్‌లో మూడు రోజులపాటు సంతాన దినాలు కొనసాగనున్నాయి. మోడర్న్‌ అరబ్‌ ప్రపంచంలో అత్యధిక కాలం లీడర్‌షిప్‌ కొనసాగించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు సుల్తాన్‌ కబూస్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com