గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా?
- January 12, 2020
సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ కారణంగా చల్లటి పానీయాలు సేవించడం, నోరు శుభ్రంగా లేకపోవడం, నోటిలో పుండ్లు ఉన్నప్పుడు గొంతు సమస్యలు వచ్చి ఆహారం సేవించకుండా, మాట్లాడనివ్వకుండా చేస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, సగం స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగితే గొంతు నొప్పి బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా గొంతు నొప్పి ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ పళ్ళరసం వెనిగర్, ఒక స్పూన్ తేనెరసం వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పొక్కిలించినా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగితే అది కూడా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!