డోర్ మాట్లపై గణేశ్ చిత్రాలు..అమెజాన్ ను దులిపేస్తున్న నెటిజన్లు...
- January 12, 2020
న్యూఢిల్లీ: సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టిల్లు భారతదేశం. అలాంటిది హిందువులు ఎంతో ఆరాధనగా పూజించే దేవుళ్ల చిత్రాలను కాలి కింద వేసుకునే డోర్ మ్యాట్లు, కప్పుకునే రగ్గులపై ముద్రించి దాన్ని అమ్మకానికి పెట్టింది ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్. దీంతో భారత వినియోగదారులు అమెజాన్ సంస్థపై ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు.
దీని పర్యవసానంగా ప్రస్తుతం ట్విటర్లో బాయ్కాట్ అమెజాన్ అనేది ట్రెండింగ్లో నిలిచింది. అమెజాన్ వెబ్సైట్లో వినాయకుడు, శివుడు, ఓంకారం గుర్తులతో డోర్మ్యాట్లు, బాత్రూం రగ్స్ దర్శనమిచ్చాయి వీటితోపాటు భారత జాతీయ జెండాతో కూడిన డోర్మ్యాట్స్ కనిపించాయి.
దీంతో షాక్కు గురైన భారతీయులు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని, భారత్ను అవమానిస్తున్నారంటూ అమెజాన్పై నిప్పులు చెరిగారు. ‘సంస్కృతిని గౌరవించడం తెలీకపోయినా అవమానించడం మానుకోండి’ అని నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.
‘మన సంస్కృతిని కించపరుస్తున్న అమెజాన్ను బహిష్కరిద్దాం’ అని నెటిజన్లు పిలుపునిచ్చారు. దీంతో ట్విటర్లో ప్రస్తుతం #BoycottAmazon అనేది ట్రెండింగ్గా నిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అమెజాన్ తాజాగా వివాదానికి కారణమైన వస్తువులను వెబ్సైట్ నుంచి తొలగింది.
కాగా అమెజాన్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుని ఫొటోలు, జాతీయ జెండాను ముద్రించిన డోర్మ్యాట్స్ను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.
మతపరమైన భావోద్వేగాలతో అమెజాన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2019 మేలోనూ హిందూ దేవుళ్ల ఫోటోలు ముద్రించిన అమెజాన్ టాయిలెట్ సీట్ కవర్లు, మ్యాట్లను తన వెబ్ సైట్ లో విక్రయానికి పెట్టింది. అంతకుముందు 2017లో అమెజాన్ కెనడా వెబ్ సైట్ లో త్రివర్ణ పతాకం ముద్రించిన డోర్ మ్యాట్లను తయారు చేసి విమర్శల పాలైంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ