భారతీయులకు బంపర్ ఆఫర్.. ఈ దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్.!
- January 13, 2020
విదేశాలకు టూర్ ప్లాన్ చేసే భారతీయులకు 58 దేశాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వీసా సమస్య లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతులు ఇస్తున్నాయి. సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇండియన్ పాస్పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. హెన్లే పాస్ పోర్ట్ 2020 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని పవర్ఫుల్ పాస్పోర్ట్స్ లిస్టులో మన భారత పాస్పోర్టు 84వ ర్యాంక్లో నిలిచింది. ఇక ఈ జాబితాలో జపాన్ పాస్పోర్టు అగ్రస్థానంలో ఉండగా.. దానితో ఈజీగా 191 దేశాలను వీసా లేకుండా సందర్శించే అనుమతి ఉంది.
ఇక సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులతో కూడా ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు. ఈ లిస్టులో ఇండియా దక్షిణ ఆసియాలోనే టాప్ ర్యాంక్ దక్కించుకోగా.. మన పాస్పోర్టుతో 58 దేశాలు అదే విధంగా చుట్టేసేయొచ్చు. అంతేకాకుండా మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 15 రోజుల పాటు ప్రయాణించడానికి ఉచిత ఆన్లైన్ వీసా కూడా లభిస్తుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







