భారతీయులకు బంపర్ ఆఫర్.. ఈ దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్.!
- January 13, 2020
విదేశాలకు టూర్ ప్లాన్ చేసే భారతీయులకు 58 దేశాలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వీసా సమస్య లేకుండానే తమ దేశాల్లో పర్యటించడానికి అనుమతులు ఇస్తున్నాయి. సాధారణంగా విదేశాలకు టూర్ కోసమైనా.. లేక చదువు కోసం వెళ్లాలన్నా వీసా తప్పనిసరిగా అవసరమవుతుంది. కొన్నిసార్లయితే వీసా సమస్యల వల్ల ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు ఇండియన్ పాస్పోర్టు మరింత పటిష్టంగా మారడంతో చాలా దేశాలు భారతీయులకు వీసా లేకుండానే పర్యటించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. హెన్లే పాస్ పోర్ట్ 2020 నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని పవర్ఫుల్ పాస్పోర్ట్స్ లిస్టులో మన భారత పాస్పోర్టు 84వ ర్యాంక్లో నిలిచింది. ఇక ఈ జాబితాలో జపాన్ పాస్పోర్టు అగ్రస్థానంలో ఉండగా.. దానితో ఈజీగా 191 దేశాలను వీసా లేకుండా సందర్శించే అనుమతి ఉంది.
ఇక సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్టులతో కూడా ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు. ఈ లిస్టులో ఇండియా దక్షిణ ఆసియాలోనే టాప్ ర్యాంక్ దక్కించుకోగా.. మన పాస్పోర్టుతో 58 దేశాలు అదే విధంగా చుట్టేసేయొచ్చు. అంతేకాకుండా మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో 15 రోజుల పాటు ప్రయాణించడానికి ఉచిత ఆన్లైన్ వీసా కూడా లభిస్తుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







