సరిలేరు నీకెవ్వరు సక్సెస్: రష్మిక ఇంట్లో ఐటీ దాడులు
- January 16, 2020టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కన్నడ హీరోయిన్ రష్మిక మందనా ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే అనుకోని షాక్ ఎదురైంది.
ఆమె సొంత రాష్ట్రం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేట శివార్లలో ఉన్న ఇంట్లో గురువారం(16 జనవరి 2020) ఉదయం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు రష్మికకు సంబంధించిన బ్యాంక్, ఆస్తి వివరాలను పరిశీలిస్తున్నారు. రష్మిక సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ప్రస్తుతం ఇంట్లో లేదు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటనకు గాను ఆమెకు ప్రశంసలు అందుతున్న సమయంలోనే ఈ ఐటీ దాడులు జరగడం విశేషం. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు కన్నడలో హీరోయిన్గా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో రష్మికకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ