తెలంగాణ:లాటరీ నెపంతో ఘరానా మోసం..
- January 16, 2020
తెలంగాణ:సైబర్ క్రైమ్స్పై అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చి అవగాహన కల్పించినా.. డబ్బుపై ఆశతో నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు జనాలు. తాజాగా.. మరో ఘటన నిజమాబాద్లో చేటుచేసుకుంది. ఆర్మూర్ మండలం చెపుర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వృత్తిలో భాగంగా కువైట్లో ఉంటున్నాడు. లాటరీలో 46 లక్షలు వచ్చాయని, అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాకు రూ. 15 లక్షలు ఇస్తే.. మీకు రూ. 46 లక్షలు ఇస్తామని నేరగాళ్లు మభ్య పెట్టారు. డబ్బుమీద ఆశతో అతను నేరగాళ్ల ట్రాప్లో పడ్డాడు. దీంతో.. తన వద్ద ఉన్న రూ.4 లక్షలతో పాటు, భార్య వద్ద ఉన్న 11 లక్షలు నేరగాళ్ల అకౌంట్లో వేశాడు. డబ్బు ఇంకా రాకపోవడంతో అతను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ కలవకపోవడంతో.. పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అనంతరం లాటరీ కాల్ ఫేక్ అని తెసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు అశోక్, ముత్తెమ్మ దంపతులు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







