తెలంగాణ:లాటరీ నెపంతో ఘరానా మోసం..
- January 16, 2020తెలంగాణ:సైబర్ క్రైమ్స్పై అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చి అవగాహన కల్పించినా.. డబ్బుపై ఆశతో నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు జనాలు. తాజాగా.. మరో ఘటన నిజమాబాద్లో చేటుచేసుకుంది. ఆర్మూర్ మండలం చెపుర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వృత్తిలో భాగంగా కువైట్లో ఉంటున్నాడు. లాటరీలో 46 లక్షలు వచ్చాయని, అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాకు రూ. 15 లక్షలు ఇస్తే.. మీకు రూ. 46 లక్షలు ఇస్తామని నేరగాళ్లు మభ్య పెట్టారు. డబ్బుమీద ఆశతో అతను నేరగాళ్ల ట్రాప్లో పడ్డాడు. దీంతో.. తన వద్ద ఉన్న రూ.4 లక్షలతో పాటు, భార్య వద్ద ఉన్న 11 లక్షలు నేరగాళ్ల అకౌంట్లో వేశాడు. డబ్బు ఇంకా రాకపోవడంతో అతను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ కలవకపోవడంతో.. పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అనంతరం లాటరీ కాల్ ఫేక్ అని తెసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు అశోక్, ముత్తెమ్మ దంపతులు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు