సౌదీలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
- January 17, 2020తెలంగాణ:సౌదీ అరేబియా దేశంలో చిక్కుకున్న తమ వారిని ఇండియాకు వాపస్ తెప్పించాలని జగిత్యాల మండలానికి చెందిన రెండు కుటుంబాల వారు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని కలిసి కోరగా, ఆయన సూచన మేరకు వారు శుక్రవారం (17.01.2020) జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన నక్క వేణు, జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్ పేట కు చెందిన గోనెల వెంకటి ఉపాధి నిమిత్తం ఆరేళ్ళ క్రితం సౌదీ అరేబియాకు లోని అభా ఖమీస్ ముషాయత్ ప్రాంతానికి వెళ్లారు.
యజమాని వారి గుర్తింపు కార్డులను లాక్కున్నాడని, యజమాని సోదరులు డిసెంబర్ 14 న దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నక్క వేణు, గోనెల వెంకటి సౌదీ లోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ లో, లేబర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఒక్కొక్కరు 9 వేల సౌదీ రియాల్స్ చెలిస్తేనే దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి (ఎగ్జిట్ పర్మిట్) ఇస్తానని యజమాని డిమాండ్ చేస్తున్నాడని వారు తెలిపారు.
నక్క వేణు తండ్రి భూమయ్య,గోనెల వెంకటి భార్య మల్లేశ్వరి లు లక్ష్మీపూర్ కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు తిరుపతి రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లాల జయపాల్ లతో కలిసి జిల్లా కలెక్టరు కు వినతి పత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు