తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి
- January 18, 2020దోహా:దోహాలో తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరో తెలంగాణ కార్మికుడి విముక్తి కలిగింది.వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా కి చెందిన సతీష్ అనే యువకుకుడు గత 3 నెలల క్రితం హౌస్ డ్రైవర్ అని వచ్చాడు.కానీ అతనికి పశువుల కాపారిగా పని చెయ్యమని చెప్పడంతోఅతనికి ఏమి చెయ్యాలో ,ఎక్కడికి వెళ్లాలో అయోమయంలో ఉండగా ఇండియాలో సామాజిక వేత్త బసంత్ రెడ్డి కి వారి బంధువులు సంప్రదించగా .సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు,ఆవిషయం తెలంగాణ గల్ఫ్ సమితి కి తెలియడంతో హుటా హుటిన బయలుదేరి అతనిని మొదట అక్కడి నుంచి విముక్తి కల్పించి, ఆశ్రయం కల్పించారు.పాస్పోర్ట్ యజమాని దగ్గర ఉండడంతో అతినికి కాల్ చేస్తే, పోయిందని చెప్పగా ఈ విషయాన్ని భారత రాయబారి కి గల్ఫ్ సమితి బృందం ప్రత్యేకంగా కలసి విన్నవించుకుంది.ఎంబసీ బృందం వెంటనే ఖతార్ ప్రభుత్వానికి అధికార మెయిల్ చెయ్యడం తో.. ఈ కేసు దాదాపు 2 నెలలు వాయిదాలు పడుతూ ఆఖరికి యజమానికి జరిమానా విధించి ,బాధితుడి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇవ్వడం తో ఈ రోజు ఆ కార్మికుడు స్వదేశానికి బయలుదేరాడు.
ముఖ్యంగా ఎంబసీ అధికారి దిరాజ్ కుమార్, ICBF ప్రతినిధి రజిని మూర్తి కి సహాయం చేసినందుకు బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
తెలంగాణ గల్ఫ్ సమితి విన్నవించుకునేది ఏంటంటే..ఖతార్ లో ఏ ఆపద వచ్చిన మనం ఓపికతో చట్టబద్ధంగా వెళితే, సహాయం తప్పకుండా మనకు దక్కుతుంది.మీకు తెలంగాణ గల్ఫ్ సమితి అన్ని విధాలుగా సహాయం చేస్తుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ