తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రపంచ వేదిక పై విరసిల్లిన తెలంగాణ సాంస్కృతిక వైభవం
- January 19, 2020దోహ, ఖతర్ లో ఇండియన్ కల్చరల్ సెంటర్ వారు భారత రాయబార కార్యాలయం మరియు ఖతర్ మ్యూజియం వారి సహకారంతో నిర్వహించిన భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం పాసేజ్ టు ఇండియా అనే శీర్షిక తో జనవరి 16 మరియు 17 తేదీల్లో MIA పార్క్ లో జరగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ తెలంగాణ వేల ఏళ్ల నుండి విశేష సాంస్కృతిక సంపద ఉందన్నారు. అలాంటి సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి దశాబ్దానికి క్రుషి చేస్తూ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.
ఈ వేడుకల్లో భాగంగా...తెలంగాణ జాగృతి ఖతర్ సభ్యులు, ఆడపడచులు హారిక , సుధ, లావణ్య, పద్మిని, రేణుక, మమత , శ్రావణి, ప్రసన్న, ప్రవీణ, రాజేశ్వరి మరియు జ్యోతి తెలంగాణ లో విశేష ప్రాచుర్యం పొందిన బంజారా మరియు ఇతర సాంస్కృతిక ప్రత్యేకతలను ఔన్నత్యాన్ని నృత్య రూపంలో ప్రదర్శించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారని తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం