హోబర్ట్లో డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న సానియా మీర్జా
- January 19, 2020
మెల్బోర్న్:ఒకవైపు మాతృమూర్తిగా బిడ్డ సంరక్షణను చూసుకోవడం, మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ..దేశ జెండాను రెపరెపలాడించడం. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ..”సరిలేరు మీకెవ్వరు” అనిపించుకుంటున్నారు భారత విమెన్ ప్లేయర్లు. దాదాపు రెండేళ్లకు పైగా ఆటకు దూరమై, తిరిగి మెగాటోర్నీలో పున:ప్రవేశం చేసి విన్నర్గా సత్తా చాటింది భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అమ్మ అయిన తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ ‘హోబర్ట్ ఇంటర్నేషనల్’లో మిక్డ్స్ డబుల్స్ కేటగిరీలో టైటిల్ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 18న ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో జరిగిన ఫైనల్లో 6-4, 6-4తో విన్నర్గా నిలిచింది సానియా-నదియా జోడి. తదనంతరం గ్రౌండ్లో తన బిడ్డతో ఫోటో దిగి “జీవితంలో ఇది అత్యంత ఆనందకరమైన రోజు” అని ఫోటో పోస్ట్ చేసింది సానియా. నిజంగా ఇది మాములు విషయం కాదు. ఆమెకు ఇప్పుడు రకరకాల సవాళ్లు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. వాటిన్నింటికి ఎదురొడ్డి నిలవాలి. జిమ్లో ఎక్కువసేపు శ్రమించాలి. మానసికంగా కూడా ఎంతో సంసిద్దత సాధించాలి. వీటన్నింటి దాటి వచ్చి ఆమె ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అమోఘం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!