హోబర్ట్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సానియా మీర్జా

- January 19, 2020 , by Maagulf
హోబర్ట్‌లో డబుల్స్ టైటిల్‌ను కైవసం  చేసుకున్న సానియా మీర్జా

మెల్బోర్న్:ఒకవైపు మాతృమూర్తిగా బిడ్డ సంరక్షణను చూసుకోవడం, మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ..దేశ జెండాను రెపరెపలాడించడం. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ..”సరిలేరు మీకెవ్వరు” అనిపించుకుంటున్నారు భారత విమెన్ ప్లేయర్లు. దాదాపు రెండేళ్లకు పైగా ఆటకు దూరమై, తిరిగి మెగాటోర్నీలో పున:ప్రవేశం చేసి విన్నర్‌గా సత్తా చాటింది భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అమ్మ అయిన తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ ‘హోబర్ట్ ఇంటర్నేషనల్’లో మిక్డ్స్‌ డబుల్స్ కేటగిరీలో టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 18న ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో విన్నర్‌గా నిలిచింది సానియా-నదియా జోడి. తదనంతరం గ్రౌండ్‌లో తన బిడ్డతో ఫోటో దిగి “జీవితంలో ఇది అత్యంత ఆనందకరమైన రోజు” అని  ఫోటో పోస్ట్ చేసింది సానియా. నిజంగా ఇది మాములు విషయం కాదు. ఆమెకు ఇప్పుడు రకరకాల సవాళ్లు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. వాటిన్నింటికి ఎదురొడ్డి నిలవాలి. జిమ్‌లో ఎక్కువసేపు శ్రమించాలి. మానసికంగా కూడా ఎంతో సంసిద్దత సాధించాలి. వీటన్నింటి దాటి వచ్చి ఆమె ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అమోఘం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com