200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి ఛాంపియన్గా నిలిచిన`సరిలేరు నీకెవ్వరు`!!
- January 21, 2020
సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల రియల్ గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి రియల్ ఛాంపియన్గా నిలిచిందన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ- `సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ మహేశ్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేశ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









