200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి ఛాంపియన్గా నిలిచిన`సరిలేరు నీకెవ్వరు`!!
- January 21, 2020
సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల రియల్ గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి రియల్ ఛాంపియన్గా నిలిచిందన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ- `సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ మహేశ్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేశ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







