200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి ఛాంపియన్గా నిలిచిన`సరిలేరు నీకెవ్వరు`!!
- January 21, 2020_1579603035.jpg)
సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల రియల్ గ్రాస్ కలెక్షన్స్ను సాధించి సంక్రాంతి రియల్ ఛాంపియన్గా నిలిచిందన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. సూపర్స్టార్ మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ- `సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్స్టార్ మహేశ్ `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల, అభిమానుల అపూర్వ ఆదరణతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ మహేశ్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. మా చిత్రాన్నిఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేశ్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`` అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..