ఫుడ్‌, సేలరీ లేకుండా బాధపడ్తున్న 60 మంది కార్మికులకు ఇండియన్‌ కాన్సులేట్‌ చేయూత

- January 21, 2020 , by Maagulf
ఫుడ్‌, సేలరీ లేకుండా బాధపడ్తున్న 60 మంది కార్మికులకు ఇండియన్‌ కాన్సులేట్‌ చేయూత

దుబాయ్‌:దుబాయ్‌లో ఇండియన్‌ కాన్సులేట్‌, 60 మంది ఇండియన్‌ వర్కర్స్‌కి చేయూతనందిస్తోంది. వారు పనిచేస్తున్న కంపెనీలు జీతాలు ఇవ్వడం మానేయడంతో గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు కార్మికులు. వారు పనిచేస్తున్న కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రెండు కంపెనీల్లో మొత్తం 100 మంది పనిచేస్తుండగా, అందులో 60 మంది ఇండియన్స్‌. కంపెనీ పార్టనర్లలో ఒకరు అల్‌ అవిర్‌ జైలులో వుండగా, మరొకరు దేశం విడిచి పారిపోవడం జరిగింది. వర్కర్స్‌ ఫిర్యాదు నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగామని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com