బుల్లితెర ప్రముఖ నటి ఆత్మహత్య..!
- January 25, 2020
ముంబై:ముంబైలో బుల్లితెర ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగు చూసింది. టీవీ ప్రముఖ నటి అయిన సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా సెజల్ శర్మ ఇప్పటికే 'దిల్ తో హ్యాపీ హై జీ' టీవీ సీరియల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ కూడా లభించింది. అంతేకాదు నటి సేజల్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ఇంట్లోనే ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మరి టీవీ నటి సేజల్ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియలేదు.
కాగా ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి సేజల్ శర్మ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. అసలు ఆమెనే సూసైడ్ లెటర్ రాసిందా? లేక మరెవరైనా రాసి ఆలా పెట్టారా? సేజల్ శర్మది అసలు ఆత్మహత్యేన.. లేక హత్యనా? ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయం ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు స్నేహితులు ఎందుకు ఆపలేదు అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి సేజల్ శర్మ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







