శంషాబాద్:కడుపులో బంగారం స్మగ్గ్లింగ్...పట్టుబడ్డ ప్రయాణికులు
- January 25, 2020
శంషాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న రాత్రి కోటిన్నర రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని తరలిస్తూ నలుగురు వేరు వేరు ప్రయాణికులు పట్టుబడ్డారు. ఏకంగా 4కిలోల బంగారం పట్టుబడింది. దుబాయ్, మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి 4 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే అలా తరలిస్తున్నారు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్, మస్కట్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారంను గుళికలు.. పేస్ట్ రూపంలో మర్చి కడుపులో దాచుకొని వచ్చారు.
అయితే.. వారి కడుపులో బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. శస్త్ర చికిత్స చేయించి, 928 గ్రాముల బంగారాన్ని బయటకు తీశారు. అయితే వీళ్ళు బంగారంను కడుపులో పెట్టుకోగా.. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు 840.98 గ్రాముల బంగారాన్ని నల్లరంగు టేపులో చుట్టి తీసుకురాగా అతన్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
మస్కట్ నుంచి వచ్చిన ఇంకో ప్రయాణికుడు మైక్రోవేవ్ ఓవెన్లో 700 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తుండగా.. పట్టుకున్నారు.ఇలా నలుగురు ప్రయాణికుల వద్ద నుండి 4 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు.కాగా వీడోక్కడే సిన్ ని తలిపించిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







