యూఏఈ: అబుధాబి లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు

- January 26, 2020 , by Maagulf
యూఏఈ: అబుధాబి లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు

 

అబుధాబి: అబుధాబి లోని భారత రాయబార కార్యాలయంలో వందలాది మంది భారతీయులు 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్ ముందుగా భారత జాతిపిత అయిన మహాత్మా గాంధీ కి పుష్పాంజలి సమర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత పవన్ కపూర్  అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అటుపై ఆయన మాట్లాడుతూ; రాయబార కార్యాలంయం అన్నివేళలా ప్రవాసీయులకు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. లేబర్ వర్కర్స్ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాయబార కార్యాలయానికి తెలపవచ్చు లేదా మీ సమీపంలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' (PBSK - Pravasi Bhartiya Sahayata Kendra: 80046342) ను సంప్రదించవచ్చని తెలిపారు. అటుపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో కపూర్ పాల్గొన్నారు.

--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి, అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com