యూఏఈ: అబుధాబి లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2020



అబుధాబి: అబుధాబి లోని భారత రాయబార కార్యాలయంలో వందలాది మంది భారతీయులు 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్ ముందుగా భారత జాతిపిత అయిన మహాత్మా గాంధీ కి పుష్పాంజలి సమర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత పవన్ కపూర్ అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అటుపై ఆయన మాట్లాడుతూ; రాయబార కార్యాలంయం అన్నివేళలా ప్రవాసీయులకు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. లేబర్ వర్కర్స్ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాయబార కార్యాలయానికి తెలపవచ్చు లేదా మీ సమీపంలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' (PBSK - Pravasi Bhartiya Sahayata Kendra: 80046342) ను సంప్రదించవచ్చని తెలిపారు. అటుపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో కపూర్ పాల్గొన్నారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి, అబుధాబి)
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









