యూఏఈ: అబుధాబి లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2020



అబుధాబి: అబుధాబి లోని భారత రాయబార కార్యాలయంలో వందలాది మంది భారతీయులు 71 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్ ముందుగా భారత జాతిపిత అయిన మహాత్మా గాంధీ కి పుష్పాంజలి సమర్పించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయులంతా ఈ కార్యక్రమంలో దేశభక్తి గీతాల్ని ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత పవన్ కపూర్ అక్కడికి చేరుకున్న భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. అటుపై ఆయన మాట్లాడుతూ; రాయబార కార్యాలంయం అన్నివేళలా ప్రవాసీయులకు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. లేబర్ వర్కర్స్ తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రాయబార కార్యాలయానికి తెలపవచ్చు లేదా మీ సమీపంలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' (PBSK - Pravasi Bhartiya Sahayata Kendra: 80046342) ను సంప్రదించవచ్చని తెలిపారు. అటుపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమంలో కపూర్ పాల్గొన్నారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి, అబుధాబి)
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







