25,000 మంది వలసదారుల తొలగింపుకి రంగం సిద్ధం

- January 29, 2020 , by Maagulf
25,000 మంది వలసదారుల తొలగింపుకి రంగం సిద్ధం

కువైట్:పార్లమెంటరీ మేన్‌ పవర్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంపీ ఖలీల్‌ అలల్‌ సలెహ్‌, 25,000 మంది వలసదారుల్ని పౌరులతో రీప్లేస్‌ చేసేందుకు సంబంధింధించిన ప్లాన్‌పై వివరించారు. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో 1,500 జాబ్‌ వేకెన్సీలు వున్నాయి. లామేకర్స్‌, వీలైనంతవరకు మేన్‌ పవర్‌ని పౌరుల నుంచే తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రైవేట్‌ సెక్టార్‌లో కూడా లోకల్‌ మేన్‌ పవర్‌ వినియోగంపైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వలసదారులకు అవకాశాలు సన్నగిల్లనున్నాయి. మొత్తంగా రానున్న రోజుల్లో 25,000 మంది వలసదారులను తొలగించి, వారి స్థానంలో లోకల్‌ వర్క్‌ ఫోర్స్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com