కరోనా ఎఫెక్ట్: ఇంటి నుంచే పనులకు కంపెనీలు ఆదేశం...
- January 30, 2020
ఇప్పుడు ఎవరినోట విన్నా ఒక్కటే మాట... కరోనా వైరస్. ఈ వైరస్ ప్రాణాంతకంగా మారబోతున్నది. ఇప్పటికే 170 మందిని పొట్టన పెట్టుకుంది. చైనా యావత్తు గజగజలాడుతున్నది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులు 28 రోజుల్లోపే మరణిస్తున్నారు. ఇది అందరిలోనూ తెలియని భయాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు 17 దేశాలకు పాకింది. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
దీంతో చైనాలో ఉన్న దిగ్గజ సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఫేస్ బుక్, అలీబాబా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే సౌలభ్యాన్ని కల్పించాయి. ఇంటినుంచి పనిచేయడం వలన కొంతమేర ఆ వైరస్ బారి నుంచి బయటపడొచ్చు అన్నది వారి వాదన. ఇక టెంసెంట్ సంస్థ ఉద్యోగులకు ఏకంగా సెలవులు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి తగ్గే వరకు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. యాపిల్ సంస్థ చైనా లో ఉన్న ఒక పెద్ద స్టోర్ ను తాత్కాలికంగా మూసేసింది. కొన్ని చోట్ల పనిగంటలను గణనీయంగా తగ్గించేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఈ సంస్థలన్నీ కూడా ఇలానే సహకరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...