దుబాయ్ లో రికార్డు సృష్టించిన డైమండ్ టాయిలెట్
- January 30, 2020
దుబాయ్: వజ్రాలతో చేయబడ్డ వస్తువులు మరియు బంగారు బర్గర్లు ఇలా ఎన్నో వింతలకు నెలవు దుబాయ్; ఇప్పుడు మరో వింతకు కేంద్రమైంది. జనవరి 28, మంగళవారం ‘ది అమేజింగ్ మ్యూజియం & ఆర్ట్ గ్యాలరీ’ లో వజ్రంతో కప్పబడిన టాయిలెట్ ను ఆవిష్కరించారు.

వజ్రాల ఆభరణాల తయారీదారు కొరోనెట్ జ్యువెలరీ మరియు హాంకాంగ్కు చెందిన ఆరోన్ షుమ్ జ్యువెలరీల విభాగం తయారుచేసిన ఈ టాయిలెట్ 40,815 వజ్రాలతో మొత్తం 334 క్యారెట్లను కలిగి ఉంది. దీని విలువ 1.28 మిలియన్ డాలర్లు (4.70 మిలియన్లు దిర్హాములు). అత్యధిక సంఖ్యలో వజ్రాలతో తయారుచేసిన ఈ టాయిలెట్ బౌల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కైవసం చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత విలువైన గిటార్ ($2 మిలియన్లు), హ్యాండ్బ్యాగ్లోని చాలా వజ్రాలు మరియు మొబైల్ ఫోన్ కేసులో సెట్ చేసిన వజ్రాల వంటివి తయారుచేసి గతంలో 10 రికార్డులు సాధించింది కొరోనెట్ సంస్థ.
_1580383994.jpg )
ఈ టాయిలెట్ ఉపయోగం కాస్త అసౌకర్యంగా మార్చే ఆ వజ్రాల గురించి ఆందోళన చెందుతున్న వారు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది కళాకృతి మాత్రమే అని ఉపయోగించని తయారుచేయలేదని; అయితే, డైమండ్ టాయిలెట్ కోసం డిమాండ్ ఉంటే, కస్టమర్ కోసం ఒకదాన్ని తయారుచేయగలనని తెలిపారు. కరోనెట్ జ్యువెలరీ సౌజన్యంతో ఈ టాయిలెట్ ఒక నెల పాటు మ్యూజియంలో ప్రదర్శనలో ఉంటుంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు







