'నిర్మల కాన్వెంట్' లో శ్రీకాంత్ తనయుడు రోషన్..
- January 19, 2016
కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి 5 షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్ జైపూర్లో, రెండో షెడ్యూల్ అరకులో, మూడో షెడ్యూల్ మెదక్లో, నాలుగో షెడ్యూల్ నైనిటాల్లో, ఐదో షెడ్యూల్ చిక్మంగుళూరులో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు.దీంతో నాగార్జున షెడ్యూల్ తప్ప దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది.ఫిబ్రవరిలో నాగార్జున షెడ్యూల్సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో సంక్రాంతి సూపర్హిట్ కొట్టిన కింగ్ నాగార్జున 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. దాదాపు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని నాగార్జున పోర్షన్ షూట్ చెయ్యాల్సి వుంది. ఫిబ్రవరిలో నాగార్జునకు సంబంధించిన షెడ్యూల్ను చేస్తారు.కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







