యూఏఈ తీరంలో భారతీయ నావికుల మృతి
- February 01, 2020
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సముద్ర తీరంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయ నావికులు మృతి చెందారు. పనామాకు చెందిన ఈ చమురు ట్యాంకర్, బుధవారం రాత్రి షార్జా తీరానికి 21 మైళ్ల దూరంలో ఉండగా దానిలో మంటలు చెలరేగాయి. అయితే మంటలను అగ్నిమాపక దళ సహాయంతో వెంటనే అదుపులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది...పలువురి ఆచూకీ తెలియకుండా పోయింది. అధికారిక సమాచారం ప్రకారం సంఘటన జరిగినప్పుడు ఆ ఓడలో 12 మంది నావికా సిబ్బందితో సహా 55 మంది ఉన్నారు.కాగా కనపడకుండా పోయిన వ్యక్తులు పాకిస్తాన్,ఇండియన్,బంగ్లాదేశ్,ఇథోపియా ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు...అయితే వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ లాండ్ అండ్ మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తెలిపారు.
ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ... జనవరి 29 న షార్జా తీరంలో ఎమ్టి సామ్ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు స్థానిక అధికారులు కాన్సులేట్కు తెలియజేశారు.ఇద్దరు భారతీయులు గాయపడ్డారు మరియు ఆసుపత్రిలో ఉండగా ఇద్దరు ఇంకా కనిపించలేదు. గాయపడిన వారిని చూడటానికి మా అధికారులు ఆసుపత్రిని సందర్శించారని తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!