యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు
- February 01, 2020యూఏఈ: చైనా నగరం వుహాన్ నుండి యూఏఈ కు వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ ను ధృవీకరించింది యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ. కాగా, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఐదు కేసులు కరోనా వైరస్ ఖాతాలో చేరాయి.
ఇంతకుముందు గుర్తించిన నాలుగు కేసులు ఇప్పటికీ వైద్య సంరక్షణలో ఉన్నాయని,
వారి పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కనుగొనబడిన కేసులను పరిష్కరించడంలో WHO ఆదేశాలకు యూఏఈ కట్టుబడి ఉంది మరియు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవరసం లేదని, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడేందుకు దేశంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు మంత్రిత్వ శాఖ తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ, సరైన సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- బార్కాలో కార్మికుల వసతికి ‘అల్ మస్కాన్ విలేజ్’
- దుబాయ్లో చిన్న ఫ్లాట్లకు పెరుగుతున్న డిమాండ్..!
- ఫైర్ ఫోర్స్ "ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్" క్యాంపెయిన్
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్