మేడారానికి హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

- February 02, 2020 , by Maagulf
మేడారానికి హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. ఆరుగురికి ప్రయాణానికి రూ.1.8 లక్షలతోపాటు అదనంగా జీఎస్టీ ఉంటుందన్నారు.  వీరికి ఇరువైపులా ప్రయాణంతోపాటు సమ్మక్క, సారలమ్మల దర్శనం కల్పిస్తామన్నారు. మరో రూ.2999 చెల్లిస్తే.. మేడారంలోని అన్ని ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా చూపిస్తామన్నారు.ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
తెలంగాణలోని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని, ఇప్పటికే ప్రసిద్ధ రామప్ప దేవాలయం యునెస్కో బృంద పరిశీలనలో ఉందని శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com