ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రదాని అభినందనలు...

- January 20, 2016 , by Maagulf
ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రదాని అభినందనలు...

పీఎస్‌ఎల్వీసీ- సీ31ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రదాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప్రగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఇస్రో విజయంపై అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com