హార్దిక్ పటేల్ మిస్సింగ్..! ఇది బీజేపీ కుట్రే అంటున్న భార్య
- February 14, 2020పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కనిపించకుండా పోయాడట... దాదాపు 20 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట.. ఈ మేరకు ఆయన భార్య కింజాల్ పటేల్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తన భర్తను గుజరాత్ పాలకులు టార్గెట్ చేశారని.. దీంతో, 20 రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాటిదార్ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తిరగతోడి తన భర్త ఒక్కడినే టార్గెట్ చేశారని ఆమో వీడియోలో ఆరోపించారు.. గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు.. బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తివేశారని.. కానీ, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న హార్దిక్ పటేల్ను వదలడంలేదన్నారు. ఇక, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను జైలుకు పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు కింజాల్ పటేల్.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు