కువైట్:60 దాటిన ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్ క్యాన్సిల్
- February 16, 2020
కువైట్:దేశంలో వలస కార్మికుల సంఖ్యను కుదించటంతో పాటు డెమోగ్రాఫిక్ ఇంబాల్స్ ను గాడిలో పెట్టేలా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్, రెసిడెన్సీ రెన్యూవల్ చేయకూడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిర్ణయించింది. అయితే..ఈ నిర్ణయం కింది స్థాయి కార్మికులకే పరమితం చేయనుంది. దీంతో లేబర్ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లరికల్ స్టాఫ్, కంపెనీ రిప్రజెంటీవ్స్, డ్రైవింగ్ రంగాల్లో ఉన్న ప్రవాసీయుల వయస్సు 60 ఏళ్లు దాటితే వారికి ఇక నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వరు. అయితే..హై ఎడ్యూకేషనల్ డ్రిగ్రీస్ బేస్డ్ ఉద్యోగులపై కువైట్ ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోదు. డాక్టర్స్, జర్నలిస్ట్స్, లీగల్ కన్సల్ట్స్, స్పెషలిస్ట్స్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్, ప్రైవేట్ కంపెనీ పార్ట్ నర్స్ కు మాత్రం వయస్సుతో నిమిత్తం సంబంధం లేకుండా రెసిడెన్సీ రెన్యూవల్ యధావిధిగా చేయనున్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







