దుబాయ్ లోని ప్రాచీన మందిర వద్ద అగ్ని ప్రమాదం
- February 17, 2020దుబాయ్: 1950 నాటి బర్ దుబాయ్ లోని హిందూ మందిరం ఎంతో ప్రశిస్థి చెందింది. యూఏఈ లోని ప్రతి హిందూ ఈ మందిరాన్ని సందర్శిస్తారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దుబాయ్ క్రీక్ ఒడ్డున బట్టల షాపుల మధ్య పాత దుబాయ్ ని తలపిస్తూ ఉండే సూక్ నడుమ దివంగత 'షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్' విరాళంగా ఇచ్చిన భూమిలో దీనిని నిర్మించారు. ఇది దుబాయ్ కి వచ్చే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.
ఈ మందిరం ఆవరణలో గల షాపులకు సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో వస్తువులను విక్రయించే దుకాణాల యజమాని కుటుంబ సభ్యుడు సోమవారం మాట్లాడుతూ ఎదురుగా ఉన్న ఒక దుకాణంలో మంటలు మొదలయ్యాయని, అయితే ఫైబర్ గ్లాస్ రూఫ్ ద్వారా ఈ దుకాణానికి వ్యాపించిందని చెప్పారు. షాపు మంటల్లో ఉండగా మాకు కాల్ వచ్చిందని, ఇక్కడికి చేరేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాయని అన్నారు.
కాగా, ఆలయానికి మంటలు వ్యాపించలేదనీ, ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని మందిరం మేనేజర్ తెలియజేసారు.
మంటల్ని అదుపులోకి తెచ్చిన సివిల్ డిఫెన్స్ అధికారులు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు మరియు ప్రజల భద్రత కోసం ఈ ప్రాంతంలోని దారులు మరియు బైలెన్లను మూసివేయబడ్డాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్