మస్కట్:ప్రవాసీయులను పెళ్లి చేసుకున్న ఒమనీ మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు
- February 18, 2020మస్కట్:ప్రవాసీయులను వివాహం చేసుకున్న ఒమనీ మహిళల విన్నపాన్ని ఒమన్ మినిస్ట్రి ఎడ్యూకేషన్ మన్నించింది. ఇక నుంచి వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమనీ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సిఫార్సుల మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒమన్ మినిస్ట్రి విడుదల చేసిన డిక్రి నెంబర్ 34/2018 ప్రకారం ఒమనీయేతర విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రవాసీయులను పెళ్లాడిన ఒమనీ మహిళలు తమ పిల్లలను డిగ్రీ నెంబర్ 34/2018 నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విన్నపాలపై పర్యవేక్షించిన ఒమనీ కమిషన్ పలుమార్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అధికారులతో చర్చించింది. ప్రాథమిక హక్కుల చట్టం, బాలల హక్కుల చట్టం మేరకు ఫీజు నుంచి మినహాయించాలని ఒమనీ కమిషన్ నివేదిక సమర్పించింది. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన విద్యామంత్రిత్వ శాఖ ప్రవాసీయులను వివాహం చేసుకన్న ఒమన మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్