మస్కట్:ప్రవాసీయులను పెళ్లి చేసుకున్న ఒమనీ మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు
- February 18, 2020మస్కట్:ప్రవాసీయులను వివాహం చేసుకున్న ఒమనీ మహిళల విన్నపాన్ని ఒమన్ మినిస్ట్రి ఎడ్యూకేషన్ మన్నించింది. ఇక నుంచి వారి పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఒమనీ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సిఫార్సుల మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒమన్ మినిస్ట్రి విడుదల చేసిన డిక్రి నెంబర్ 34/2018 ప్రకారం ఒమనీయేతర విద్యార్ధులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రవాసీయులను పెళ్లాడిన ఒమనీ మహిళలు తమ పిల్లలను డిగ్రీ నెంబర్ 34/2018 నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విన్నపాలపై పర్యవేక్షించిన ఒమనీ కమిషన్ పలుమార్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అధికారులతో చర్చించింది. ప్రాథమిక హక్కుల చట్టం, బాలల హక్కుల చట్టం మేరకు ఫీజు నుంచి మినహాయించాలని ఒమనీ కమిషన్ నివేదిక సమర్పించింది. కమిషన్ సిఫార్సులను పరిశీలించిన విద్యామంత్రిత్వ శాఖ ప్రవాసీయులను వివాహం చేసుకన్న ఒమన మహిళల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం