దుబాయ్లో ఆధునిక సదుపాయాలతో హిందూ మందిరం
- February 18, 2020దుబాయ్: కొత్తగా 25 వేల చదరపు అడుగుల స్థలంలో మిలియన్ దిర్హాముల భారీ ఖర్చుతో హిందూ దేవాలయం జెబెల్ అలీలో నిర్మించబడుతుంది. సింధి గురు దర్బార్ ఆలయ బోర్డు సభ్యులు గత వారం శంఖుస్థాపన చేశారు. ఈ ఆలయం బర్ దుబాయ్లోని మందిరానికి పొడిగింపుగా ఉంటుందని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త మరియు సింధి గురు దర్బార్ ఆలయ ధర్మకర్తలలో ఒకరైన రాజు ష్రాఫ్ ప్రకటించారు.
ఈ ఆలయాన్ని జెబెల్ అలీలోని గురు నానక్ దర్బార్ ప్రక్కనే నిర్మిస్తారు. దీంతో చర్చి, సిక్కు గురు నానక్ దర్బార్ మరియు హిందూ మందిరం ఒకేచోట ఉండనున్నందుకు ఈ ప్రాంతం దుబాయ్లోని బహుళ-మత కారిడార్గా ప్రఖ్యాతిగాంచుతుందని ష్రాఫ్ వివరించారు. సింధి గురు దర్బార్ కోసం భూమిని దుబాయ్ ప్రభుత్వం 2018 బహుమతిగా ఇచ్చింది ఆలయ నిర్మాణం 2022 లో పూర్తవుతుందని భావిస్తున్నారు. కట్టనున్న ఈ భవనం లో రెండు అంతస్తులు, రెండు బేస్మెంట్ అంతస్తులు మరియు భారీ పార్కింగ్ సదుపాయం ఉంటుంది.
ఆలయ రూపకల్పన మరియు నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ అనే భారతీయ నిర్మాణ సంస్థ ఈ ఆలయ రూపకల్పనను అందించింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 200 కి పైగా దేవాలయాలను రూపొందించింది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ నుండి అనుమతులు వచ్చాయి.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..