ట్రంప్ పుణ్యమా అని 'యమున' కు కొత్త పుంతలు
- February 19, 2020ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భారత పర్యటనలో యూపీలోని తాజ్ మహల్ను సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో తాజ్మహల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజ్మహల్కు ఒకవైపున యమనానది ప్రవహిస్తుంటుంది. ఈ నదిలో కలుషితమైన నీరు ప్రవహిస్తుందనే విషయం విదితమే. అదేవిధంగా యమునా నది నీటి నుంచి వచ్చే దుర్వాసన కారణంగా స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ట్రంప్ వచ్చే సమయంలో యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం బులంద్ షహర్లోని గంగా నది నుంచి 500 క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడిచిపెట్టనున్నారు. ఫలితంగా యమునా నది చక్కగా పారుతున్నట్లు కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా యమునలో ప్రవాహం పెరిగితే దుర్వాసన అంతగా వ్యాపించకుండా ఉంటుందని అనుకుంటున్నారు. భారత్లో ట్రంప్ ఈనెల 23 నుంచి 26 వరకూ పర్యటించనున్నారు. అధిక సమయం ఢిల్లీలోనే గడపనున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్