ఆ రైలు లో శివునికి సీటు...క్లారిటీ ఇచ్చిన పియూష్ గోయల్
- February 19, 2020ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్ప్రెస్ రైలులో దేవుడికి ఓ బెర్త్ రిజర్వ్ చేశారని వచ్చిన కథనాలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తాము ఏ దేవుడి కోసం రైలులో రిజర్వేషన్ చేయించలేదని స్పష్టం చేశారు. మతం ఆధారంగా ఇలాంటివి జరగలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం జరగబోదని చెప్పారు. రైలు ప్రారంభం రోజు కావడంతో పూజలు చేయడం కోసం మాత్రమే చిత్రపటాన్ని వాటిని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు.
కాాగా ఆదివారం ప్రారంభమైన కాశీ మహాకాల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓ బెర్తును ఆలయంలా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పించారు. దేవుడి కోసం ప్రత్యేకించి సీటును కేటాయించడం ఏంటన్ని ప్రశ్నించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. తాను కూడా ప్రయాణించే సమయంలో సాయిబాబా, గణేశుని ఫొటోలు తీసుకెళ్తానని చెప్పారు. 'చాలామంది ముస్లింలు రైల్లో ప్రయాణిస్తూ నమాజ్లు చేసుకుంటారు. వాళ్లని కూడా ఎవరూ ఆపడం లేదుకదా ' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్