అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు
- February 19, 2020
లక్నో: అయోధ్యలో త్వరలోనే రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ బుధవారంనాడు తెలిపారు. దీనికి ఎలాంటి అవరోధాలు ఉండవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసిందని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ కోసం బుధవారం సాయంత్రం ట్రస్టు సమావేశమవుతోందని ఆయన తెలిపారు. 'సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రబుత్వానికి నా ధన్యవాదాలు. సాధ్యమైనంత త్వరగా రామాలయ నిర్మాణం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుంది' అని దినేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేశారు. తొలి సమావేశంలో ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరుగనుంది. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ, హోం శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం ఆలయ నిర్మాణం ప్రారంభించే తేదీని ఖరారు చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







