అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి అడుగు
- February 19, 2020
లక్నో: అయోధ్యలో త్వరలోనే రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ బుధవారంనాడు తెలిపారు. దీనికి ఎలాంటి అవరోధాలు ఉండవన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసిందని, ఇందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ కోసం బుధవారం సాయంత్రం ట్రస్టు సమావేశమవుతోందని ఆయన తెలిపారు. 'సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రబుత్వానికి నా ధన్యవాదాలు. సాధ్యమైనంత త్వరగా రామాలయ నిర్మాణం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆలయ నిర్మాణం జరుగుతుంది' అని దినేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శ్రీ రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేశారు. తొలి సమావేశంలో ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరుగనుంది. ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ, హోం శాఖ ప్రధాన కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్థి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశం ఆలయ నిర్మాణం ప్రారంభించే తేదీని ఖరారు చేసే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







