జర్మనీలో కాల్పులు...ఎనిమిది మంది మృతి

- February 20, 2020 , by Maagulf
జర్మనీలో కాల్పులు...ఎనిమిది మంది మృతి

జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ సిటీ దగ్గర (భారత కాలమానం ప్రకారం) నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక వ్యక్తి అక్కడ ఉన్న వారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తి కోసం జల్లెడపడుతున్నారు.

కాల్పులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. అతడు ఎందుకు కాల్చాడు అనే విషయం కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. హనయు లోని బార్ వద్ద ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సహాయ బృందాలు అక్కడి ప్రజలకు సహాయ చర్యలు ప్రారంభించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com