హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్న మెలానియా ట్రంప్

- February 20, 2020 , by Maagulf
హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్న మెలానియా ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌తో పాటు భారత్‌కు వచ్చే అతని భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొననున్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫిబ్రవరి 25న ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆమె 45 నిముషాల పాటు చిన్నారులతో గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఈ నెల 24న ప్రారంభం కానుంది. కాగా 2018లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్ క్లాసులను ప్రారంభించారు. చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడేలా ఈ తరగతులకు రూపకల్పన చేశారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ హ్యాపీనెన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com