హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్న మెలానియా ట్రంప్
- February 20, 2020
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్తో పాటు భారత్కు వచ్చే అతని భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొననున్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఫిబ్రవరి 25న ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే హ్యాపీనెస్ క్లాసులో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆమె 45 నిముషాల పాటు చిన్నారులతో గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఈ నెల 24న ప్రారంభం కానుంది. కాగా 2018లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్ క్లాసులను ప్రారంభించారు. చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడేలా ఈ తరగతులకు రూపకల్పన చేశారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ హ్యాపీనెన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







