బాలీవుడ్లోకి ‘మైత్రీ’ సంస్థ.. సల్మాన్తో..
- February 20, 2020
టాలీవుడ్లోని బడా నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగెట్టిన ఈ సంస్థ.. అనతికాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సంస్థ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతోందట. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ బావమరిది, నిర్మాత అతుల్ అగ్నిహోత్రితో సంప్రదింపులు చేశారట మైత్రీ నిర్మాతలు. సల్మాన్తో సినిమా తీయాలనుకుంటున్నట్లు తమ అభిప్రాయాన్ని అతుల్తో చెప్పారట. ఆ నిర్ణయంపై అతుల్ కూడా సానుకూలంగా స్పందించారట. ఇక త్వరలో మరోసారి ఆయనను కలవనున్న మైత్రీ నిర్మాతలు.. కథపై సల్మాన్తోనూ సంప్రదింపులు జరపనున్నారట. ఒకవేళ ఆ కథ సల్లూ భాయ్కు నచ్చితే.. త్వరలోనే మైత్రీ సంస్థ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
కాగా తెలుగులో మైత్రీ సంస్థ ఇప్పుడు రెండు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఉప్పెన ఒకటి. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ చిత్రాన్ని ఈ సంస్థ నిర్మించనుంది. అలాగే ప్రభాస్తోనూ ఓ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు సమాచారం.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







