మనామ: మాస్క్ ప్రైజ్ రేట్ల ట్యాంపరింగ్..మూడు మెడికల్ స్టోర్స్ సీజ్
- February 26, 2020
కరోనా వైరస్ భయంతో ఇటీవలి కాలంలో మాస్క్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు మాస్క్ రేట్లను ట్యాంపర్ చేస్తున్నారు కొందరు మెడికల్ స్టోర్స్ యజమానులు. మాస్క్ రేట్లను బ్లాక్ చేయటంగానీ, ఎక్కువ ధరలకు విక్రయించిన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. మెడికల్ స్టోర్స్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు..బుదైయ, రిఫా, మొహారక్లో మూడు స్టోర్స్ లో మాస్క్ ప్రైజ్ ట్యాంపర్ చేసినట్లు గుర్తించారు. ఆ మూడు స్టోర్స్ ను సీజ్ చేశారు. కరోనా వైరస్ భయం నేపథ్యంలో మాస్క్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసింది. అయితే..మాస్క్ లను బ్లాక్ చేయటం ద్వారా ప్రజల్లో ఆందోళన రేపి మార్కెట్లో రేట్లను పెంచుతున్నాయని అధికారులు తెలిపారు. ఎవరైనా రేట్లను ట్యాంపర్ చేసినా..మెడికల్ గూడ్స్ బ్లాక్ చేసినా కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..