దోహ: కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- February 26, 2020
దోహ:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఖతార్ హెల్త్ మినిస్ట్రి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కోవిడ్-19 సోకిన వ్యక్తులను గుర్తించేందుకు కావాల్సిన వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన పరికరాలను హెల్త్ మినిస్టర్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ హెచ్ఇ అబ్దుల్లా బిన్ నాజర్ తుర్కి అల్ సుబాయ్ ఆమెకు విమానాశ్రయంలోని మెడికల్ ఎక్విప్మెంట్, థర్మల్ స్క్రీనింగ్ గురించి వివరించారు. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ చెకప్ చేసే మెడికల్ స్టాఫ్ ఎంతటి సంసిద్ధతతో ఉందో కూడా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హెల్త్ మినిస్టర్..వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించి వారి సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైఅలర్ట్ పాటించాల్సిన ప్రాముఖ్యతను అధికారులకు వివరించారు. చైనా, దక్షిణ కొరియా, ఇరాన్, సింగపూర్, జపాన్, ఇటలీ వంటి కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతాయన్నారు ఆమె.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







