మనామ: మాస్క్ ప్రైజ్ రేట్ల ట్యాంపరింగ్..మూడు మెడికల్ స్టోర్స్ సీజ్
- February 26, 2020
కరోనా వైరస్ భయంతో ఇటీవలి కాలంలో మాస్క్ లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు మాస్క్ రేట్లను ట్యాంపర్ చేస్తున్నారు కొందరు మెడికల్ స్టోర్స్ యజమానులు. మాస్క్ రేట్లను బ్లాక్ చేయటంగానీ, ఎక్కువ ధరలకు విక్రయించిన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. మెడికల్ స్టోర్స్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు..బుదైయ, రిఫా, మొహారక్లో మూడు స్టోర్స్ లో మాస్క్ ప్రైజ్ ట్యాంపర్ చేసినట్లు గుర్తించారు. ఆ మూడు స్టోర్స్ ను సీజ్ చేశారు. కరోనా వైరస్ భయం నేపథ్యంలో మాస్క్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసింది. అయితే..మాస్క్ లను బ్లాక్ చేయటం ద్వారా ప్రజల్లో ఆందోళన రేపి మార్కెట్లో రేట్లను పెంచుతున్నాయని అధికారులు తెలిపారు. ఎవరైనా రేట్లను ట్యాంపర్ చేసినా..మెడికల్ గూడ్స్ బ్లాక్ చేసినా కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







