ఇరాన్ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్
- February 28, 2020
తెహ్రాన్ : కరోనా వైరస్ (కొవిడ్-19) ఇరాన్ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఆరోగ్య శాఖ ఉపమంత్రి హరిర్చికి కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్కు సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. ఈ రిపోర్టు శనివారానికి వచ్చే అవకాశం ఉందని ఫరీబా తెలిపారు. ఇరాన్లో మొత్తం 240 మందికి కరోనా వైరస్ సోకగా 26 మంది మఅతి చెందారు. ఫిబ్రవరి 19 న ఒక్కరోజే కరోనా వైరస్ సోకినట్లు 106 కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో ఈ వైరస్ బారినపడి 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 వేల మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







