ఇరాన్ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్
- February 28, 2020
తెహ్రాన్ : కరోనా వైరస్ (కొవిడ్-19) ఇరాన్ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఆరోగ్య శాఖ ఉపమంత్రి హరిర్చికి కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్కు సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. ఈ రిపోర్టు శనివారానికి వచ్చే అవకాశం ఉందని ఫరీబా తెలిపారు. ఇరాన్లో మొత్తం 240 మందికి కరోనా వైరస్ సోకగా 26 మంది మఅతి చెందారు. ఫిబ్రవరి 19 న ఒక్కరోజే కరోనా వైరస్ సోకినట్లు 106 కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో ఈ వైరస్ బారినపడి 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 వేల మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!