ఇరాన్ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్
- February 28, 2020
తెహ్రాన్ : కరోనా వైరస్ (కొవిడ్-19) ఇరాన్ను కబళిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఆరోగ్య శాఖ ఉపమంత్రి హరిర్చికి కరోనా వైరస్ సోకగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్కు సోకడంతో ఇరాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్ సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు. ఎబ్తేకర్కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో.. ఆమె బృందంలో ఉన్న మరికొందరు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమునాలను సేకరించి వైద్యశాలకు పంపారు. ఈ రిపోర్టు శనివారానికి వచ్చే అవకాశం ఉందని ఫరీబా తెలిపారు. ఇరాన్లో మొత్తం 240 మందికి కరోనా వైరస్ సోకగా 26 మంది మఅతి చెందారు. ఫిబ్రవరి 19 న ఒక్కరోజే కరోనా వైరస్ సోకినట్లు 106 కేసులు నమోదయ్యాయి. ఇక చైనాలో ఈ వైరస్ బారినపడి 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 వేల మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









