సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలో ఐఎస్ఐఎస్ దాడి
- January 22, 2016
సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.సోమాలియా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. మొగాదీషు నగరంలోని సముద్ర తీరంలో లిడో బీచ్ లో షెబబ్ రెస్టారెంట్ ఉంది. గురువారం రాత్రి ఈ రెస్టారెంట్ లో చాల మంది భోజనం చేస్తున్నారు.అదే సమయంలో రెస్టారెంట్ ను చుట్టుముట్టిన ఉగ్రవాదులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. ఆ ఘటన అత్యంత పాశవికమైన చర్యగా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ అభివర్ణించారు.ఈ దాడికి తామే భాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (పిబాబ్) ప్రకటించింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని, ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నామని పోలీసు అధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ తెలిపారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









