వీసాల్ని రద్దు చేసిన టూరిజం మినిస్ట్రీ
- February 29, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూరిస్ట్ వీసాల జారీని రద్దు చేసింది. చైనా, ఇటలీ, కొరియా, జపాన్, మలేసియా, సింగపూర్ మరియు కజికిస్తాన్ దేశాల నుంచి వచ్చేవారికి టూరిస్ట్ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ అలర్ట్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దేశాలకు గతంలో మంజూరు చేసిన వీసాల్ని కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలు మంజూరు చేసినవారికి మాత్రం కొనసాగిస్తామని అన్నారు. అయితే, వారికి మక్కా మరియు మదీనాలను సందర్శించేందుకు అవకాశమివ్వరు. పౌరుల భద్రతే ముఖ్యమనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన ప్రతి చర్యనూ తీసుకుంటామని అధికారులు వివరించారు. కాగా, వీసాల రద్దు అనేది తాత్కాలికమేనని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..