వీసాల్ని రద్దు చేసిన టూరిజం మినిస్ట్రీ

- February 29, 2020 , by Maagulf
వీసాల్ని రద్దు చేసిన టూరిజం మినిస్ట్రీ

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం, టూరిస్ట్‌ వీసాల జారీని రద్దు చేసింది. చైనా, ఇటలీ, కొరియా, జపాన్‌, మలేసియా, సింగపూర్‌ మరియు కజికిస్తాన్‌ దేశాల నుంచి వచ్చేవారికి టూరిస్ట్‌ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ అలర్ట్‌ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దేశాలకు గతంలో మంజూరు చేసిన వీసాల్ని కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వీసాలు మంజూరు చేసినవారికి మాత్రం కొనసాగిస్తామని అన్నారు. అయితే, వారికి మక్కా మరియు మదీనాలను సందర్శించేందుకు అవకాశమివ్వరు. పౌరుల భద్రతే ముఖ్యమనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన ప్రతి చర్యనూ తీసుకుంటామని అధికారులు వివరించారు. కాగా, వీసాల రద్దు అనేది తాత్కాలికమేనని మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com