వీసాల్ని రద్దు చేసిన టూరిజం మినిస్ట్రీ
- February 29, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూరిస్ట్ వీసాల జారీని రద్దు చేసింది. చైనా, ఇటలీ, కొరియా, జపాన్, మలేసియా, సింగపూర్ మరియు కజికిస్తాన్ దేశాల నుంచి వచ్చేవారికి టూరిస్ట్ వీసాల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ అలర్ట్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ దేశాలకు గతంలో మంజూరు చేసిన వీసాల్ని కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసాలు మంజూరు చేసినవారికి మాత్రం కొనసాగిస్తామని అన్నారు. అయితే, వారికి మక్కా మరియు మదీనాలను సందర్శించేందుకు అవకాశమివ్వరు. పౌరుల భద్రతే ముఖ్యమనీ, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన ప్రతి చర్యనూ తీసుకుంటామని అధికారులు వివరించారు. కాగా, వీసాల రద్దు అనేది తాత్కాలికమేనని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







